BannerFans.com
Home » APBLOGGER
రజనీ 'శివాజి' 3డి రిలీజ్ ఖరారు




హైదరాబాద్ :‘‘నాన్నా పందులే గుంపుగా వస్తాయి.. సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది'' అనే డైలాగు మరో సారి ధియోటర్ లో మారు మ్రోగనుంది. రజనీకాంత్ చిత్రం ‘శివాజి'చిత్రాన్ని 3డిలోకి కన్వర్ట్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ అంటే వచ్చే నెల మూడో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయాన్ని సోమవారం హైదరాబాద్ హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ థియేటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాతలు తెలియచేసారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాల్ని ప్రదర్శించారు.
చిత్ర నిర్మాత ఎం.ఎస్‌.గుహన్ మాట్లాడుతూ...''మంచి కథ, కథనాలు, సాంకేతిక విలువలు ఉన్నాయి కాబట్టే 'శివాజి' చిత్రాన్ని త్రీడీలోకి మార్చాలనుకొన్నాం. అయితే ఈ విషయాన్ని మొదట్లో రజనీకాంత్‌కి కూడా చెప్పలేదు. సినిమా పూర్తయ్యాక చూపిద్దామనుకొన్నాం. ఇటీవల ఆయన త్రీడీలో కొన్ని సన్నివేశాల్ని చూసి.. తెరపైన ఉన్నది నేనేనా? అంటూ ఆశ్చర్యపోయారు'' అన్నారు‌. రజనీకాంత్‌ హీరోగా నటించిన చిత్రం 'శివాజి'. శంకర్‌ దర్శకత్వం వహించారు. అయిదేళ్ల కిందట ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి ప్రస్తుతం త్రీడీ హంగులద్దుతున్నారు.
అలాగే ''నాలుగు వందల మంది సాంకేతిక నిపుణులు యేడాదిపాటు నిర్విరామంగా కృషి చేసి ఈ చిత్రాన్ని త్రీడీలోకి మార్చారు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు.. అందరినీ అలరించేలా తీర్చిదిద్దారు. హాలీవుడ్‌ నుంచి వచ్చే ఈ తరహా చిత్రాల నిడివి తక్కువగా ఉంటుంది. అందుకే 'శివాజి' నిడివిని కూడా తగ్గించాం. ప్రస్తుతం సాంకేతికపరమైన కార్యక్రమాలు తుది దశలో ఉన్నాయి. సెప్టెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.
చిత్రాన్ని త్రీడీలోకి మారుస్తున్న ప్రసాద్స్‌ గ్రూప్స్‌ సంస్థ డైరెక్టర్‌ సాయిప్రసాద్‌ మాట్లాడుతూ ''టుడీ చిత్రాన్ని త్రీడీలోకి మార్చడం ఒక గొప్ప ప్రక్రియ. కొన్ని కారణాల దృష్ట్యా ఈ చిత్రాన్ని కొంత కుదించాం. ‘శివాజి 3డి' నిడివి 2 గంటల 17 నిమిషాలు మాత్రమే ఉంటుంది. ప్రస్తుతం 3డి వర్క్ తుదిదశకు చేరుకుందిమరిన్ని చిత్రాల్ని త్రీడీలోకి మార్చబోతున్నాము''అన్నారు. ఈ కార్యక్రమంలో వసంత్‌, కిషన్‌ తదితరులు పాల్గొన్నారు. ‘శివాజి 3డి' వెర్షన్‌లోని ‘పువ్వల్లే నవ్వుల్ నవ్వుల్..' పాటను మీడియాకు ప్రదర్శించారు.

బిజినెస్ పార్టనర్లుగా కింగ్ నాగార్జున - క్రికెట్ స్టార్ ధోనీ



టాలీవుడ్ రొమాంటిక్ హీరో నాగార్జున, డేరింగ్ డ్యాషింగ్ క్రికెటర్ ధోనీ బిజినెస్ పార్టనర్లయ్యారు. మహేంద్ర సింగ్ ధోనీకి నాగార్జున బైక్‌లపై ఉన్న మోజు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బైక్‌లపై ఉన్న ఈ అమిత మోజుతో ధోని-నాగార్జున "ఎం.ఎస్.డి. ఆర్-యన్ రేసింగ్ టీం ఇండియా" అని ఓ కొత్త బైక్ రేసింగ్ జట్టును ఏర్పాటు చేసి సంయుక్తంగా రేసింగ్ రంగంలోకి దిగారు. వరల్డ్ సూపర్ బైక్ చాంపియన్‌షిప్‌లో ధోనీ- నాగార్జున టీమ్ పాల్గొననున్నాయి.

ప్రస్తుతం ఈ ధోనీ- నాగార్జున టీం యఫ్.ఐ.యమ్ సూపర్ స్పోర్ట్స్ వరల్డ్ ఛాంపియన్‌లో పాల్గొంటుంది. 17 రేసుల చాంపియన్‌షిప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగే 10వ రేసులో ధోనీ- నాగ్ టీమ్ ఎంట్రీతో దుమ్మురేపనుంది. 

ధోనీ- నాగ్ రేసింగ్ టీంలో బైక్ రైడర్లు ఫ్రాన్స్ దేశస్థుడు ఫ్లొరియన్ మరినో మరొకరు బ్రిటన్ దేశస్థుడు డాన్ లిన్‌ఫుట్. ధోనీ- నాగ్ రేసింగ్ టీంకు ధోనీ మేనేజర్ అరుణ్ పాండే మేనేజింగ్ డైరెక్టర్, నాగార్జున డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం.

UPSC – Assistant Commandants Examination

UPSC – Assistant Commandants Examination: UPSC
Post Name:Assistant Commandants Examination

Qualification: AnyGraduate

Job Location:Anywhere in India

Last Date: 27thAug ,2012

Details:

Notification No.11/3/2011-E1(B),Examination Notice No.11/2012-CPF

Educational Qualifications: A candidate must hold a Bachelor’s degree ...

Punjab National Bank – Probationary Officers/ Management Trainees

Punjab National Bank – Probationary Officers/ Management Trainees: Punjab National Bank



Post Names:Probationary Officers/ Management Trainees

Qualification:Any Graduate

Job Location: New Delhi

Last Date:27th Aug 2012

Important Dates:

Opening Date for Online Registration- 13th ...

Related Posts Plugin for WordPress, Blogger...