టాలీవుడ్ రొమాంటిక్ హీరో నాగార్జున, డేరింగ్ డ్యాషింగ్ క్రికెటర్ ధోనీ బిజినెస్ పార్టనర్లయ్యారు. మహేంద్ర సింగ్ ధోనీకి నాగార్జున బైక్‌లపై ఉన్న మోజు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బైక్‌లపై ఉన్న ఈ అమిత మోజుతో ధోని-నాగార్జున "ఎం.ఎస్.డి. ఆర్-యన్ రేసింగ్ టీం ఇండియా" అని ఓ కొత్త బైక్ రేసింగ్ జట్టును ఏర్పాటు చేసి సంయుక్తంగా రేసింగ్ రంగంలోకి దిగారు. వరల్డ్ సూపర్ బైక్ చాంపియన్‌షిప్‌లో ధోనీ- నాగార్జున టీమ్ పాల్గొననున్నాయి.

ప్రస్తుతం ఈ ధోనీ- నాగార్జున టీం యఫ్.ఐ.యమ్ సూపర్ స్పోర్ట్స్ వరల్డ్ ఛాంపియన్‌లో పాల్గొంటుంది. 17 రేసుల చాంపియన్‌షిప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌లో జరిగే 10వ రేసులో ధోనీ- నాగ్ టీమ్ ఎంట్రీతో దుమ్మురేపనుంది. 

ధోనీ- నాగ్ రేసింగ్ టీంలో బైక్ రైడర్లు ఫ్రాన్స్ దేశస్థుడు ఫ్లొరియన్ మరినో మరొకరు బ్రిటన్ దేశస్థుడు డాన్ లిన్‌ఫుట్. ధోనీ- నాగ్ రేసింగ్ టీంకు ధోనీ మేనేజర్ అరుణ్ పాండే మేనేజింగ్ డైరెక్టర్, నాగార్జున డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని సమాచారం.